విద్యార్థులను అవమానించడమే: కోదండరామ్
తెలంగాణ కోసం రాజీనామాలు చేసే ప్రజాప్రతినిధులను తిరిగి గెలిపించుకునే బాధ్యత జెఎసిదేనని ఆయన చెప్పారు. అందుకు నియోజక వర్గాల వారిగా కమిటీలను వేస్తామని ఆయన అన్నారు. తనపై సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి చేసిన ఆరోపణపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం క్షుద్ర రాజకీయమని ఆయన అన్నారు. తాను ముల్లాను కానని, జెఎసి నిర్ణయాలను చదివి, అమలుకు సహకరించే కన్వీనర్ ను మాత్రమేనని ఆయన అన్నారు. తాను ఫత్వాలు జారీ జేయడం లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.
తాను జెఎసి నిర్ణయాలు మాత్రమే చెబుతున్నానని, తన వ్యక్తిగత నిర్ణయాలు చెప్పడం లేదని ఆయన అన్నారు. రాజకీయాలు సృజనాత్మకంగా ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుందని, జెఎసి తీసుకునే నిర్ణయాల నుంచి తాము వెనక్కి పోమని ఆయన చెప్పారు. వందల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఈ స్థితిలో ఆత్మహత్యలు ఆపడానికి పరిష్కారం చూపడం రాజకీయాలు జరగాలని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల టీవిల్లో కనిపిస్తారేమో గానీ సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. తమ సంస్థ ఆదేశిస్తే ఆ మేరకు వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.