వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులను అవమానించడమే: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రెచ్చగొట్టడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ మండిపడ్డారు. అది విద్యార్థులను అవమానించడమేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న రాజకీయ నాయకుల రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద ఆయన శుక్రవారం మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే సీమాంధ్ర నాయకులు సహకరించాలని ఆయన కోరారు. తమ జెఎసి కలిసే ఉందని ఆయన చెప్పారు.

తెలంగాణ కోసం రాజీనామాలు చేసే ప్రజాప్రతినిధులను తిరిగి గెలిపించుకునే బాధ్యత జెఎసిదేనని ఆయన చెప్పారు. అందుకు నియోజక వర్గాల వారిగా కమిటీలను వేస్తామని ఆయన అన్నారు. తనపై సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి చేసిన ఆరోపణపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం క్షుద్ర రాజకీయమని ఆయన అన్నారు. తాను ముల్లాను కానని, జెఎసి నిర్ణయాలను చదివి, అమలుకు సహకరించే కన్వీనర్ ను మాత్రమేనని ఆయన అన్నారు. తాను ఫత్వాలు జారీ జేయడం లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.

తాను జెఎసి నిర్ణయాలు మాత్రమే చెబుతున్నానని, తన వ్యక్తిగత నిర్ణయాలు చెప్పడం లేదని ఆయన అన్నారు. రాజకీయాలు సృజనాత్మకంగా ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుందని, జెఎసి తీసుకునే నిర్ణయాల నుంచి తాము వెనక్కి పోమని ఆయన చెప్పారు. వందల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఈ స్థితిలో ఆత్మహత్యలు ఆపడానికి పరిష్కారం చూపడం రాజకీయాలు జరగాలని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల టీవిల్లో కనిపిస్తారేమో గానీ సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. తమ సంస్థ ఆదేశిస్తే ఆ మేరకు వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X