వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం పోరాడుతాం: రాజ్ నాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajnath Singh
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ కోసం పోరాడుతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. తెలంగాణపై తాము కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము ఇంతకు ముందు పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడామని, ఇకపై కూడా పోరాడుతామని ఆయన చెప్పారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

తెలంగాణ సున్నితమైన అంశమని, దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, అది మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ జాప్యం వల్ల యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23వ తేదీన బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం తెలంగాణ గర్జన సభను తలపెట్టింది. ఈ సభలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. అయితే ఈ సభకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X