వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలయజ్ఞానికి నిధుల కొరత నిజమే: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: రాష్ట్రంలో చేపట్టిన జలయజ్ఞానికి నిధుల కొరత ఉన్న మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి కె. రోశయ్య అంగీకరించారు. అయితే ఆదాయాన్ని అంచనా వేసుకుని జలయజ్ఞానికి తగిన నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరుతూ ఆయన శనివారం ఉదయం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైయస్ చేపట్టిన రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తానని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, ఈ మేరకు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి సహకరిస్తున్నారని, సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆరు వేల కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ, కాకినాడ పెట్రో కారిడార్ పనులు కూడా సాగుతున్నాయని, త్వరలోనే అది వస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకు తగిన పునాదులు పడ్డాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X