వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదులో సహజీవన్ రన్: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ ప్రజలతో రేపు ఉదయం హైదరాబాదులో సహజీవన్ రన్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేస్తున్న సాగిస్తున్న రాజకీయ నాయకుల రిలే నిరాహార దీక్షలు శనివారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. సహజీవన్ రన్ రేపు ఉదయం హైదరాబాదులోని మూసాపేట నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వరకు సాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడానికి సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆయన కోరారు.

తెలంగాణపై కేంద్రం సీరియస్ గానే ఉందని, అయితే కేంద్ర నిర్ణయం వచ్చేదాకా ఆందోళన సాగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రకటనలో స్పష్టత లేదని, స్పష్టత కోసం మరింత ఒత్తిడి తేవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను గమనించి సీమాంధ్ర నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఆవేశకావేషాలకు లోనై సీమాంద్ర నేతలు విద్యార్థులను రెచ్చగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చిందని, అయితే కొంత మంది పెట్టుబడిదారులు దాన్ని అడ్డుకుంటున్నారని శాసనసభ్యుడు బస్వరాజు సారయ్య అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X