తుస్సుమన్న చిరంజీవి అనాసాగరం పర్యటన
ఒక్కొక్కరి ఇంటికి చిరంజీవి వెళ్లి కుటంబసభ్యులను ఓదార్చారు. జరిగిన ఘటన తమ కుటుం బాలను అంధకారంలోకి నెట్టి వేసిందని, ఆదుకోవాలని కోరుతూ చిరంజీవి కాళ్లపై పడి వారు భోరున విలపించారు. వారి కష్టాలు, బాధలను స్వయంగా విన్న చిరంజీవి చలించిపోయారు. ఓ దశలో అభిమానులు 'మెగాస్టార్ చిరంజీవి' అంటూ నినాదాలు చేస్తూ, ఈలలు వేస్తుండగా చిరంజీవి ఒకింత అసహనానికి లోనయ్యారు. తాను పార్టీ తరఫున గానీ, సినీ నటుని హోదాలో గానీ ఇక్కడకు రాలేదని, బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు మాత్రమే వచ్చానని తెలి పారు. అభిమానులు ఓర్పు వహించి మౌనంగా ఉండాలని పదేపదే కోరారు. అయినప్పటికీ అభిమానులు అత్యుత్సాహం చూపి నాయకులు, పోలీసులను పక్కకు నెట్టివేయడంతో పలుసార్లు చిరంజీవి ఆగ్రహానికి గురయ్యారు.
చిరంజీవి గ్రామ పర్యటన గందరగోళంగా సాగింది. నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం, ముందుండి నడిపించే వారే కొరవడటంతో ఎవరింటికి వెళ్లాలో, ఎవరిని పరామర్శించాలో తెలియక చిరంజీవి అయోమయంలో పడ్డారు. నాయకులు ఓ వైపు వెళ్దామని చెబుతుండగా, పోలీసులు మరో వైపు రావాల్సిందిగా కోరారు.