వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు హైకమాండ్ ఆదేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: తెలంగాణ జెఎసి నుంచి బయటకు రావాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి మీడియా వద్ద ఏమీ మాట్లాడకూదని కూడా అధిష్టానం వారిని ఆదేశించింది. క్రమశిక్షణ ఉల్లంఘించి తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హెచ్చరించారు. తెలంగాణపై ఏర్పాటు చేయదలసిన కమిటీకి విధివిధానాలు ఇంకా రూపొందించలేదని ఆయన తెలిపారు.

ఇలా ఉండగా కమిటీ వేసే ఆలోచనను మానుకొని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు మ్యాపు కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంటులో పెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని ఆ ప్రాంత పొలిటికల్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అన్ని పార్టీల్లో తెలంగాణ ప్రాంత కమిటీలు వేయాలని కోరింది. తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర నిర్మాణ ప్రక్రియకు తోడ్పాడాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉద్యమంలోకి రావాలని కోరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X