వైష్ణవి హత్య విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు: సిఎం

గత నెల 23 నుంచి ఇప్పటి వరకు విషాదకరమైన వార్తలే వింటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 17కు చేరిందని, కొంత మంది ఇంకా అస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఆబ్కారీ ప్రొహిబిషన్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వరస పడవ ప్రమాదాలు కూడా సంభవించాయని ఆయన అన్నారు. విశాఖ పట్నం జిల్లాలో జరిగిన పడవ ప్రమాదాలపై మెజీస్టిరియల్ విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications