వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెసుపై నాగం అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమాల్లో కాంగ్రెసు తెలంగాణ నేతల తీరుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెసు నాయకులు మొక్కుబడిగా పాల్గొంటే సరిపోదని, ఇద్దరో ముగ్గురో నాయకులు ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జెఎసి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెసు నాయకులపై ఉందని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వేసే కమిటీకి నిర్దిష్ట కాల పరిమితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీ తెలంగాణ ప్రజల అభిప్రాయాలను మాత్రమే తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరడానికి తాము గవర్నర్ నరసింహన్ ను కలుస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X