వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రాహుల్ అమరవీరులను అవమానించారు'

By Pratap
|
Google Oneindia TeluguNews

Uddhav Thackeray
ముంబై: కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ముంబై దాడుల్లోని అమర వీరులను అవమానించారని శివసేన కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే విమర్శించారు. ముంబై దాడుల్లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ఉత్తరాదికి చెందిన ఎన్ఎస్జీ సిబ్బంది అసమాన ప్రతిభ ప్రదర్శించారని రాహుల్ గాంధీ అనడం అమరవీరులను అవమానించడమేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

దాడుల్లో అమరులైన మరాఠీ పోలీసులు హేమంత్ కర్కరే, ఆశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్, తుకారామ్ ఓంబ్లేలను, ఎన్ఎస్జీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ను తన మాటల ద్వారా రాహుల్ గాంధీ అవమానించారని ఆయన అన్నారు. ముంబైపై దాడులు జరిగినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X