వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ప్రతి భారతీయుడిది: రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
పాట్నా: ఇతర ప్రాంతాలపై దాడులు చేస్తున్న శివసేన, ఎంఎన్ఎస్ లపై కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. భారత్ ప్రతి ఒక్క భారతీయుడిదని ఆయన అన్నారు. తన దేశంలో ఎక్కడైనా భారతీయులపై దాడి జరిగితే తాను మౌనంగా ఉండలేనని ఆయన అన్నారు. థాకరే ఏమంటున్నారో తనకు అనవసరమని, తనకు కావాల్సింది ఒక విధానమని, అది భారత్ ప్రతి భారతీయుడనేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

బీహార్, ఉత్తరప్రదేశ్ వారికి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని ఆయన అన్నారు. భారతీయులపై దేశంలో ఎక్కడైనా దాడులు జరిగితే తాను మౌనంగా ఉండలేనని ఆయన అన్నారు. ముంబై దాడుల సందర్భంగా ఉగ్రవాదులను హతమార్చిన ఎన్ఎస్జీలో బీహారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు, మరాఠీలు అందరూ ఉన్నారని ఆయన సోమవారం అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X