వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కమిటీపై నేడు కోర్ కమిటీ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఖరారు చేసేందుకు కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. కమిటీ విధివిధానాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. కాలపరిమితిని కూడా విధించింది. అయితే, కాంగ్రెసు కోర్ కమిటీలో చర్చించిన తర్వాత వాటిని ప్రకటించాలని భావించారు. అందుకు గాను కాంగ్రెసు కోర్ కమిటీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సమావేశమవుతోంది.

నిజానికి, కాంగ్రెసు కోర్ కమిటీ సోమవారంనాడే భేటీ కావాల్సింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో లేకపోవడంతో భేటీ వాయిదా పడింది. ఆయన కోల్ కత్తాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. కమిటీ విధివిధానాలు ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పదజాలం కూర్పును ప్రణబ్ ముఖర్జీయే సూచించారు. అందుకు అనుగుణంగా ఉందా, లేదా చూడడానికి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో ఉండడం అవసరంగా మారింది. దీంతో సోమవారంనాటి కోర్ కమిటీ భేటీని వాయిదా వేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X