తెలంగాణ కమిటీపై నేడు కోర్ కమిటీ భేటీ

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఖరారు చేసేందుకు కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. కమిటీ విధివిధానాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. కాలపరిమితిని కూడా విధించింది. అయితే, కాంగ్రెసు కోర్ కమిటీలో చర్చించిన తర్వాత వాటిని ప్రకటించాలని భావించారు. అందుకు గాను కాంగ్రెసు కోర్ కమిటీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సమావేశమవుతోంది.

నిజానికి, కాంగ్రెసు కోర్ కమిటీ సోమవారంనాడే భేటీ కావాల్సింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో లేకపోవడంతో భేటీ వాయిదా పడింది. ఆయన కోల్ కత్తాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. కమిటీ విధివిధానాలు ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పదజాలం కూర్పును ప్రణబ్ ముఖర్జీయే సూచించారు. అందుకు అనుగుణంగా ఉందా, లేదా చూడడానికి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో ఉండడం అవసరంగా మారింది. దీంతో సోమవారంనాటి కోర్ కమిటీ భేటీని వాయిదా వేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+