ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య: కె కేశవరావు

కమిటీ విధివిధానాల్లో ఏమైనా తేడా వస్తే పార్టీ అధిష్టానంతో మాట్లాడుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై సమాచారం ఇవ్వడానికే శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసిందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు అనుగుణంగానే కమిటీ విధివిధానాలుంటాయని ఆయన చెప్పారు.తెలంగాణ రావాలనే ఆతురుతలో కొందరు ఆవేశపడుతున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ఉద్యమం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణపై పార్లమెంటుదే అంతిమ నిర్ణయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications