తెలంగాణపై త్వరగా స్పందించాలి: సురేష్ రెడ్డి

తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తామని అనడం సరి కాదని కాగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరై తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీ లోపల కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ప్రకటించాలని ఆయన కోరారు. కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే శాసనసభ ఏమిటి, ప్రభుత్వాన్నే స్తంభింపజేస్తామని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications