వైయస్ ప్రమాదంపై అనుమానాలు: టిడిపి ఎమ్మెల్యే

రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడంపై యరపతినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డిపై తామెప్పుడు ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో జగన్కు ఉన్న ఆదరణ చూసి భయపడాల్సిన పని టీడీపీకి లేద ని అన్నారు. టీడీపీ నాయకులను విమర్శించే ముందు కాంగ్రెసు నాయకులు తమ స్థితిగతులేమిటో ఒక్కసారి గుర్తుంచుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని యరపతినేని సూచించారు. జిల్లాలో నలుగురు రాష్ట్ర మంత్రులు, ఒక కేంద్ర మంత్రి, ఒక డిప్యూటీ స్పీకర్, శాసన మండలి వైస్ చైర్మన్ ఉండి నారాయణపురం పేలుళ్ళ బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని యరపతినేని అన్నారు.












Click it and Unblock the Notifications