వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకమాండ్ ను ఇబ్బంది పెట్టొద్దు: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు రెండ్రోజులు వెనకా ముందూ వస్తాయని, అందువల్ల కాంగ్రెసు నాయకులు తొందరపడవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రెండు రోజుల్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఖరారవుతాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ అంశం సున్నితమైంది, తీవ్రమైందని, అందువల్ల శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ఓపిక పట్టాలని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య రాగద్వేషాలు పెంచవద్దని కూడా ఆయన కోరారు.

పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా పార్టీ నాయకులు ప్రవర్తించవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రాక్టికల్ గా ఆలోచించాలని ఆయన కోరారు. విద్యార్థులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, ఆత్మహత్యల వల్ల తెలంగాణకు నష్టమే జరుగుతుందని ఆయన అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 17వ తేదీన జరుగుతుందని ఆయన చెప్పారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగుతాయని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ స్థాయికైనా వెళ్తామని ఆయన చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ఆయన చెప్పారు. ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలు, రియంబర్స్ మెంట్ విడుదలవుతాయని, ఈ విషయంలో అపోహలు కూడదని ఆయన అన్నారు. ముస్లింలకు మతప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించలేదని, వెనకబాటు ఆధారంగానే కల్పించామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X