తెరాస రాజీనామాల నిర్ణయం వాయిదా

తాము జెఎసి నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని అనుకుంటున్నామని, అటువంటి స్థితిలో కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. దాంతో కెసిఆర్ వెంటనే తమ పార్టీ నాయకులతో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. జెఎసి నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని ఆ తర్వాత తెరాస ప్రకటించింది. తిరిగి శనివారం ఉదయం కెసిఆర్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యాడు. జెఎసి సమావేశం జరిగే వరకు రాజీనామాల విషయంలో వేచి చూడాలని తెరాస నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెరాస నిర్ణయం వల్ల మిగతా పార్టీలు కూడా జెఎసి నుంచి బయటకు వచ్చే వాతావరణం ఏర్పడింది. దీంతో తెరాస రాజీనామాల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications