వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుణె పేలుళ్ళ సిసిటివి ఫుటేజ్ సేకరణ: ఐజి

By Santaram
|
Google Oneindia TeluguNews

Pune
ముంబై: జర్మనీ బేకరీలో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని సేకరించామని శాంతిభద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ రష్మీ శుక్లా తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. జర్మనీ హోటల్‌కు ఎదురుగా ఉన్న ఐదు నక్షత్రాల హోటల్‌ సీసీటీవీ శనివారం జర్మనీ బేకరీ ముందుభాగంలో జరిగిన పరిణామాలకు సంబంధించిన దృశ్యాలను బంధించిందని, దీనిని యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఉన్నతాధికారులు సేకరించారన్నారు. ఈ బేకరీలో సీసీటీవీ వెసులుబాటు లేదని, ఈ ఫుటేజీ దృశ్యాలను ఏటీఎస్‌ పరిశీలిస్తోందని వివరించారు. అయితే ఫుటేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు.శనివారం రాత్రి జర్మనీ బేకరీలో జరిగిన భీకర బాంబు పేలుడు ఘటనలో తొమ్మిది మంది చనిపోగా, 57 మంది గాయపడిన సంగతి విదితమే. కాగా సదరు జర్మన్‌ దేశీయుడు తన భార్య కోసం తొలుత ప్రభుత్వ ససూన్‌ ఆసుపత్రికి వె ళ్లాడు. అక్కడి మార్చురీలో తొమ్మిది మృతదేహాలు ఉండగా అందులో ఆరు స్థానికులవే కనిపించాయి. ఇతరుల మృతదేహాలెవరివనేవి ఇంకా తెలియరాలేదు.

ప్రత్యేక బృందం ఏర్పాటు: పుణేలోని జర్మనీ బేకరీలో శనివారంనాటి బాంబు పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రక్రియను వేగంగా జరిపేందుకుగాను పోలీస్‌ చీఫ్‌ ఎ.ఎన్‌.రాయ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఏటీఎస్‌ చీఫ్‌ కె.పి.రఘువంశి, ఏటీఎస్‌ డీఐజీ రవీంద్ర కదమ్‌ తదితరులను ప్రభుత్వం నియమించింది. పేలుడు కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేసేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఒక బృందం ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇతర రాష్ట్రాలకు బయలుదేరిందన్నారు. మృతులందరినీ గుర్తించామని రష్మీ శుక్లా వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఓ కొలిక్కి తెస్తామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుతీరతామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X