వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ అల్పాహార విందును బహిష్కరించిన టిడిపి

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం ఇచ్చిన అల్పాహార విందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, సీపీఐ పార్టీకి చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. ఓయూ ఘటనకు నిరసనగా టీడీపీ అల్పాహార విందును బహిష్కరించింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో సమైక్యాంధ్ర కొనసాగింపు చేర్చటంపై నిరసన వ్యక్తం చేస్తూ సీపీఐ అల్పాహర విందుకు డుమ్మా కొట్టింది. అలాగే టీఆర్‌ఎస్‌, బీజేపీ విందును బహిష్కరించాయి.

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని సభాపతి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం శాసనసభ్యులకు అల్పాహార విందునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన ఈ అల్పాహార విందుకు ముఖ్యమంత్రి రోశయ్య, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్‌, పార్థసారథి, కన్నా లకీనారాయణ, గాదె వెంకటరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, మేయర్‌ కార్తీకరెడ్డి తదితరులు హాజరు అయ్యారు. అలాగే సీపీఎం, పీఆర్పీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు విందుకు హాజరు అయ్యారు. ప్రతి బడ్జెట్‌ సమావేశాలకు ముందు సంప్రదాయం మేరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్పీకర్‌ అల్పాహార విందు ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X