వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ తో తెలుగుదేశం ఎమ్మెల్యేల భేటీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: స్పీకర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డిని మంగళవారం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఓయూలో లాఠీఛార్జ్‌ ఘటన, విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశాలపై సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌ రెడ్డి స్పీకర్‌ కు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ఓయూ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రోశయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయ సంక్షోభం సృష్టించటం ద్వారానే తెలంగాణ సాధించగలుగుతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ కు అందచేసామని మోత్కుపల్లి తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X