బడ్జెట్ పై పెదవి విరిచిన చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. ఆదాయానికి, బడ్జెట్ అంచనాలకు పొంతన లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బడ్జెట్ రోశయ్య అంకెల గారడీకి నిదర్శనమని ఆయన అన్నారు. దూరదృష్టి లేకుండా ఐదేళ్ల పాటు రాష్టానికి నష్టం తెచ్చారని ఆయన విమర్శించారు. పేరుకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అయినా సామాన్యుడిపై విపరీతమైన పన్నుల భారం పడిందని ఆయన అన్నారు. ఆర్థిక మండళ్ల పేరుతో పేదల వ్యవసాయ భూములను తీసుకుని జమీందారి వ్యవస్థను కాంగ్రెసు ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. పరిశ్రమలు రాకుండానే పేదల భూములు తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. యువతకు బడ్జెట్ లో ఉపాధి అవకాశాల మాట లేదని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి ప్రణాళిక లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పరిస్థితి లాగానే బడ్జెట్ కూడా అంతుబట్టకుండా ఉందని ఆయన అన్నారు. జీతాలకు, చెల్లింపులకు ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని ఆయన అన్నారు. అప్పులు పెరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ లో డిఎస్సీ నిర్వహణ ఊసు లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే 50 ఏళ్లయినా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావని ఆయన అన్నారు. గతంలో హామీ ఇచ్చిన 30 కిలోల రేషన్ బియ్యం సరఫరా, రైతులకు 9 గంటల విద్యుత్తు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదని ఆయన విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై, ముస్లిం రిజర్వేషన్లపై రోశయ్య తన బడ్జెట్ లో ప్రతిపాదించకపోవడాన్ని ఆయన నిరసించారు. ధరల పెరుగుదల నియంత్రణ గురించి రోశయ్య మాట్లాడకపోవడం విచారకరమని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+