విధ్వంసానికి దిగిన తెలంగాణ విద్యార్థులు

ఆంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల విధ్వంసానికి దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థి ఆత్మహత్యపై తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇది సిగ్గుమాలిన ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు కళ్లు మూసుకుని చోద్యం చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోస్తాంధ్ర నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల వల్లనే తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications