కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ జిల్లాలో ముగ్గురు హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar Dist
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షలు, అనుమానాలు ఈ హత్యలకు దారి తీశాయి. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం నడికేడు గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నారాయణ అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి గత రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భూమన్న అనే వ్యక్తిపై దాడి చేశాడు. ముందు జాగ్రత్తగా భీమన్న పక్కనే కత్తి ఉంచుకున్నాడు. ఆ కత్తితో తనపైకి వచ్చినవారిపై ఎదురు దాడి చేశాడు.

భూమన్న చేసిన ఎదురు దాడిలో తీగల నారాయణ, మల్లవ్వ, శేఖర్ అనే ముగ్గురు వ్యక్తులు అక్కకక్కడే మరణించారు. లింగన్న, సాయమ్మ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తీగల నారాయణకు, భూమన్నకు మధ్య చాలా కాలంగా తగాదాలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా భూమన్న మంత్రతంత్రాలు చేయిస్తున్నాడని నారాయణ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. దీంతో వారు భూమన్నపై దాడికి ప్రయత్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X