హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ పై అసెంబ్లీ నుంచి టిడిపి వాకౌట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: విద్యుత్ సమస్యపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం సభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజారాజ్యం పార్టీ మాత్రం నిరసన తెలిపింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య పలు మార్లు వాగ్వివాదం జరిగింది. విద్యుచ్ఛక్తి విషయంలో కాంగ్రెసు చర్యల వల్ల రాష్ట్రం 15 ఏళ్లు వెనకబడిపోయిందని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెసు ప్రభుత్వం అంధప్రదేశ్ గా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ప్రజారాజ్యం శాసనసభ్యుడు చిరంజీవి విమర్శించారు. విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. విద్యుచ్ఛక్తి శాఖకు మంత్రి కూడా లేరని, ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న పొన్నాల లక్ష్మయ్య పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరికి తాము నిరసన తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X