వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ కోటలోనూ సౌండ్, లైట్ షోలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: కాకతీయుల నాటి పురాతనమైన రాతి కట్టడాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్న ఖిలావరంగల్‌ కోట ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. దీన్ని జిల్లాలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌ మధ్య కోటలోని నాలుగు కాకతీయ కళాతోరణాల మధ్య రూ.4కోట్లతో సౌండ్స్‌, లైటింగ్‌, లేజర్‌షోను ఏర్పాటు చేసేందుకు మంగళవారం సంబంధిత అధికారులు పరిశీలించారు.

ఈ నిధుల విడుదలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది. ఏపీటీటీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గోల్కొండ కోటలో రూ.కోటితో సౌండ్స్‌, లైటింగ్‌ నిర్మాణం చేసినట్లుగానే వరంగల్‌లోనూ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల 25న పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ కె.వీరభద్రరావు కోటను సందర్శించిన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించార. ఎంతో విలువైన ప్రాచీన కట్టడాలు కలిగి వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ఖిలావంరగల్‌ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో కోట ప్రజలు, పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షించిన వారిలో సౌండ్స్‌, లైటింగ్‌ ఏర్పాటు ఇన్‌ఛార్జి ఓంకార్‌, న్యూసైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు హైదరాబాద్‌ నుంచి వచ్చిన కాంట్రాక్టర్స్‌ ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X