వరంగల్ కోటలోనూ సౌండ్, లైట్ షోలు
ఈ నిధుల విడుదలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఏపీటీటీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్కొండ కోటలో రూ.కోటితో సౌండ్స్, లైటింగ్ నిర్మాణం చేసినట్లుగానే వరంగల్లోనూ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల 25న పురావస్తుశాఖ సూపరింటెండెంట్ కె.వీరభద్రరావు కోటను సందర్శించిన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించార. ఎంతో విలువైన ప్రాచీన కట్టడాలు కలిగి వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ఖిలావంరగల్ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో కోట ప్రజలు, పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షించిన వారిలో సౌండ్స్, లైటింగ్ ఏర్పాటు ఇన్ఛార్జి ఓంకార్, న్యూసైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పాండురంగారావు హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్స్ ఉన్నారు.
Comments
Story first published: Wednesday, March 10, 2010, 15:48 [IST]