రాయలసీమను భరించలేం: శంకర రావు

Shankar Rao
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమను తెలంగాణతో కలిపి ఉంచాలనే తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రతిపాదనను కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు పి. శంకరరావు తిరస్కరించారు. రాయలసీమను తెలంగాణ భరించలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాయలసీమ వల్లనే తెలంగాణ వెవకబడిపోయిందని ఆయన అన్నారు. వనరులున్నా తెలంగాణ అభివృద్ధి జరగకపోవడానికి రాయలసీమ నేతలే కారణమని ఆయన అన్నారు.

డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత మొదటి వ్యతిరేకించినవారు రాయలసీమ నాయకులేనని, ఇప్పుడు తెలంగాణతో కలుస్తామనడం సరి కాదని, అది నమ్మకద్రోహమేనని ఆయన అన్నారు. రాయలసీమ నేతలే ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించారని, ఎక్కువ కాలం రాయలసీమ నేతల ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు. రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాల నాయకులు ముఖ్యమంత్రులయ్యారని ఆయన అన్నారు.

తెలంగాణవారు ఎవరితోనూ కలవాలని కోరుకోవడం లేదని, 1956 నాటి హైదరాబాద్ రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటనను సీమాంధ్ర పేరుతో వ్యతిరేకించింది రాయలసీమవాసులేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+