హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమను భరించలేం: శంకర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమను తెలంగాణతో కలిపి ఉంచాలనే తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రతిపాదనను కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు పి. శంకరరావు తిరస్కరించారు. రాయలసీమను తెలంగాణ భరించలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాయలసీమ వల్లనే తెలంగాణ వెవకబడిపోయిందని ఆయన అన్నారు. వనరులున్నా తెలంగాణ అభివృద్ధి జరగకపోవడానికి రాయలసీమ నేతలే కారణమని ఆయన అన్నారు.

డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత మొదటి వ్యతిరేకించినవారు రాయలసీమ నాయకులేనని, ఇప్పుడు తెలంగాణతో కలుస్తామనడం సరి కాదని, అది నమ్మకద్రోహమేనని ఆయన అన్నారు. రాయలసీమ నేతలే ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించారని, ఎక్కువ కాలం రాయలసీమ నేతల ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు. రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాల నాయకులు ముఖ్యమంత్రులయ్యారని ఆయన అన్నారు.

తెలంగాణవారు ఎవరితోనూ కలవాలని కోరుకోవడం లేదని, 1956 నాటి హైదరాబాద్ రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటనను సీమాంధ్ర పేరుతో వ్యతిరేకించింది రాయలసీమవాసులేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X