హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ చానళ్ళ నియంత్రణకు కమిటీ

By Santaram
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్‌: తెలుగు టీవీ చానళ్ళపై పోలీసుల పట్టు బిగుస్తోంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఛానళ్లలో నేర, అశ్లీల ప్రసారాల నియంత్రణకు త్వరలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలోని టీవీ ఛానళ్ల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఖాన్‌ మాట్లాడుతూ ఛానళ్లలో నేర కథనాలు, అశ్లీల ప్రసారాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుందన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఛానళ్లకు వారం తర్వాత నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక నుంచి కేబుల్‌ ప్రసారాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని ఖాన్‌ పేర్కొన్నారు. అలాగే కేబుల్‌ టీవీ 1995 చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈ నెల 22వ తేదీ నుంచి షోకాజ్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X