ఎసిబి దాడులు: అరవింద రావు వర్సస్ కెసిఆర్

అరవిందరావుపై కెసిఆర్ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను లక్ష్యంగా ఎంచుకుని దాడులు నిర్వహించేందుకు ఎసిబి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. అరవిందరావు ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చెందిన స్వామి గౌడ్, విఠల్ వంటి నాయకుల ఇళ్లపై ఎసిబి దాడులు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు అరవింద రావు సారథ్యంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య పథకం రచించారని ఆయన విమర్శించారు. రోశయ్యకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులపై ఎసిబి దాడులు జరిగితే సహించబోమని ఆయన హెచ్చరించారు.
కాగా, కెసిఆర్ ఆరోపణలను అరవింద రావు తోసిపుచ్చారు. బాధ్యత గల నాయకుడు అలాంటి ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కచ్చితమైన ఆధారాల మేరకే అవినీతి అధికారుల ఇళ్లపై తాము దాడులు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమకు ప్రాంతీయ వాదాలు అంటగట్టడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications