వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిట్ ముందు 27న మోడీ హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు విచారణ నిమిత్తం హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ వర్గాలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. సిట్ ముందు విచారణ నిమిత్తం మోడీ హాజరయ్యే విషయంపై అయోమయం నెలకొంది. ఈ నెల 21వ తేదీన హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సిట్ చీఫ్ ఇంతకు ముందు చెప్పారు. అయితే తనకు సమన్లు రాలేదని మోడీ చెప్పారు. దీంతో ఆ అయోమం చోటు చేసుకుంది.

మోడీని ఈ నెల 27వ తేదీన సిట్ ప్రశ్నించే అవకాశాలున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నప్పటికీ దానిపై మాట్లాడడానికి సిట్ చీఫ్ ఆర్ కె రాఘవన్ నిరాకరించారు. ఇది సిట్ కు, సాక్షికి మధ్య హక్కులకు సంబంధించిన సమాచారమని, దీనిపై తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఫిర్యాదుకు సంబంధించి మోడీని ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. గుల్బర్గా సొసైటీ అల్లర్లలో 69 మందితో పాటు జాఫ్రీ మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X