హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ప్రభుత్వ విప్ శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నమ్మకద్రోహానికి పాల్పడడం, బ్లాక్ మెయిల్ చేయడం, అబద్ధాలను పదే పదే మాట్లాడుతూ వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం చంద్రబాబు అనుసరించే మార్గాలని, దానితోనే చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను అసమర్థులని చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పు పట్టారు.

డిప్యూటీ స్పీకర్ ను నైతికంగా దెబ్బ తీయడానికే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై అభిప్రాయం చెప్పకుండా పారిపోయిన చంద్రబాబు తమను ఎలా విమర్శిస్తారని ఆయన అడిగారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్లనే తెలుగుదేశం పార్టీని రెండు సార్లు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X