Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టుల టెర్రర్

Maoists
శ్రీకాకుళం: జిల్లాకు సరిహద్దులోని ఒడిషా గజపతి జిల్లాలో పోలీసు కమెండోలపై మావోయిస్టులు జరిపిన దాడితో జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మావోయిస్టుల దాడిలో ముగ్గురు కమెండోలు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గజపతి జిల్లా నుంచి మావోయిస్టులు శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించటానికి పలు మార్గాలు ఉన్నా యి. ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతంలోని సీతంపేట ఏజెన్సీ, ఉద్దానం ప్రాంతాల్లో మావోయిస్టులకు పట్టు ఉంది. ఈ నేపథ్యంలో గజపతి జిల్లా నుంచి మావోయిస్టులు జిల్లాలోకి చొరబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గజపతి జిల్లాలో ఉన్నారని భావిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు జిల్లా గుండా తప్పించుకుపోవటానికి యత్నించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిషా సరిహద్దు గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రధానంగా సీతంపేట ఏజెన్సీలోని భామిని, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, ఉద్దానంలోని సరి హద్దు మండలాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఒడిషా నుంచి వచ్చే వాహనాలను, జిల్లాలోని పట్టణాల్లో ఉన్న లాడ్జీ లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్ల వద్ద భద్రతను పటిష్టపరిచారు. పోలీసు స్టేషన్లపై మావోయిస్టులు దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవంక, మావోయిస్టులపై పోరుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు ఏఓబీలోకి చొచ్చుకుపోతున్నాయి. జాతీయ రహదారితో పాటు ఒడిషాకు వెళ్లే మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+