శ్రీకృష్ణ కమిటీకి పెద్దగా పని లేదు: కెకె

విడిపోతామని తెలంగాణ ప్రజలు అంటుంటే, కలిసుందామని సీమాంధ్ర నేతలు అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై పార్టీ అధిష్టానానికి తన అభిప్రాయాన్ని చెబుతానని ఆయన అన్నారు. పాతబస్తీ అల్లర్లపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ అల్లర్ల వెనక కుట్ర ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే కుట్ర దాగి ఉందనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల విచారణ జరిపించడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications