జెసి, టిజి అజ్ఞానులు: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: కాంగ్రెసు రాయలసీమ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, టిజి వెంకటేష్ అజ్ఞానులని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉందని జెసి, కోట్లకు పడగలెత్తడానికి తెలంగాణవారు గల్ఫ్ వలస వెళ్లతున్నారని టిజి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. వారిద్దరి వారి ఆస్తులకే ప్రతినిధుల గాని, ప్రజలకు ప్రతినిధులు కారని ఆయన అన్నారు. కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణలో రెండవ విడత యాత్ర నిర్వహిస్తామని, ఈ యాత్ర కొమురవెల్లి నుంచి కాగజ్ నగర్ వరకు సాగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ కోత, నదీ జలాలు, జలయజ్ఞం లోటుపాట్లను ఈ యాత్రలో ప్రజలకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మోసాలను కూడా ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి తెలుగుదేశం, కాంగ్రెసు ఒక్కటేసి నివేదికలను మాత్రమే ఇవ్వాలని, పార్టీల తరఫున మాత్రమే ఈ నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+