అల్లర్లకు కర్నాటక నిధులు ఉత్తదే: సబిత

హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతో పాటు, సమస్యాత్మకంగా భావించే జిల్లాల్లో సైతం అదనపు బలగాలను మోహరించాలని డీజీపీని ఆదేశించారు. కర్ఫ్యూ సడలించిన సమయంలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి 206 రేషన్షాపులు తెరిచి ఉంచామని, ముప్ఫైకి పైగా సంచార కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశామని, పాలు పుష్కలంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామని అనంతరం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేఖరులకు తెలిపారు. సడలింపు సమయంలో అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై అలాంటి వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications