వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగారెడ్డిలో మినీ శిల్పారాం: గీతారెడ్డి

By Santaram
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రూ. 3 కోట్ల వ్యయంతో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు మూడు ప్రతిపాదనలను అమలులోకి తీసుకువచ్చామన్నారు.

వాటిలో మినీ శిల్పారామం ఒకటి కాగా, మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 3.50 కోట్లు, రూ. 4 కోట్లతో సింగూరు వద్ద పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గజ్వేల్‌ ను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయతలపెట్టిన మినీ శిల్పారామానికి స్థల సేకరణ చేస్తున్నామన్నారు.

కళాకారులు, చేతివృత్తుల వారికి ఎంతో దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం హైదారాబాద్‌ లోని శిల్పారామంలో రూ. 2.60 కోట్లతో నైట్ బజార్ కొనసాగిస్తున్నామన్నారు. 12 కోట్ల రూపాయలతో కొండాపూర్‌లోని మ్యూజియం నుంచి నందికంది, ఝరాసంగం, ఏడుపాయల, మెదక్ చర్చి నుంచి సిద్దిపేటలోని కోమటిచెరువు వరకు మెదక్ సర్కిట్‌గా ఓ ప్రతిపాదన తయారు చేశామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X