గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును తప్పుదారి పట్టిస్తున్నారు: నన్నపనేని

By Pratap
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
గుంటూరు: తన పార్టీపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం తీరును తప్పు పడుతూ కాంగ్రెసు పార్టీపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో పని చేసేవారికి పదువులు ఉండవని, పైరవీలు చేసేవారికే పదవులు దక్కుతాయని ఆమె శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పార్టీలోని ఓ వర్గం తప్పుదోవ పట్టిస్తోందని ఆమె విమర్శించారు.

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పదవులు దక్కవని, కాంగ్రెసు పార్టీలో కష్టపడి పనిచేసేవారికే పదవులు దక్కుతాయని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీని ఓ వర్గం శాసిస్తోందని ఆమె విమర్శించారు. జయప్రద, రోజాలు పార్టీలోకి వస్తామని అంటున్నందననే మీరు పార్టీపై విమర్శలు చేస్తున్నారా అని అడిగితే వారిని పార్టీలోకి రావాలని తాను అడిగానని, తానే వారిని పార్టీలోకి తెస్తానని ఆమె అన్నారు. అసంతృప్తితో తాను పార్టీపై విమర్శలు చేయడం లేదని, పార్టీ పరిస్థితిపై మాట్లాడుతున్నానని ఆమె అన్నారు. జయప్రదను గానీ రోజాను గానీ పార్టీలోకి రావద్దని ఎందుకు అంటానని ఆమె అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X