జలయజ్ఞంపై సిఎంకు లేఖాస్త్రాలు
జలయజ్ఞం కింద పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య, నిర్మాణ వ్యయం పెరుగుతూ పోతున్న వైనం, లిఫ్టులకు వినియోగమయ్యే విద్యుత్తు తదితర అంశాలపై జానారెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలోని అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. లిఫ్టులకు అవసరమైన విద్యుత్తు, నిర్వహణ, అమలు ఖర్చును ప్రభుత్వం భరిస్తామని చెపుతున్నా రైతులకు ఆందోళనగానే ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, సూక్ష్మసేద్యం, లిఫ్టుల వంటి అంశాలపై తాను పలుమార్లు తన అభిప్రాయం వెల్లడించానని, వాటిని తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జానారెడ్డి లేఖ రాయడానికి ముందుగానే మార్చి 23న నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యకు ఓ లేఖ రాసినట్లు ఆ పత్రిక తెలిపింది. ఏడు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినా, వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పలు విషయాలను ఆయన లేవనెత్తారు.