అధికార వాంఛతో రాలేదు: చిరంజీవి

వారి అధికారానికి ఆటంకంగా ఉన్నామని భావిస్తున్న వారు తమ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను మానసికంగా దెబ్బ తీసేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మీడియా ద్వారా కూడా తమను దెబ్బ తీసే ప్రయత్నానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం వల్ల తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉండడం కొందరికి అధికారంలోకి రావడానికి ఆటంకంగా ఉందని, దాంతో వారు వారి పార్టీ విధానాలను చెప్పుకోకుండా తమ పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీని ఎందుకు నిలబెట్టలేకపోయామని ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications