హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవి కెసిఆర్ వ్యక్తిగత వ్యాఖ్యలు: జానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే అంతర్యుద్ధం వస్తుందని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యక్తిగతమని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి అన్నారు. అయితే కాంగ్రెసు పార్టీ ఆ పరిస్థితిని రానివ్వదేమోనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రిని అవుతానని అన్నారని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా అంతకన్నా ముందు కాకూడదా అని ఆయన ప్రశ్నించారు.

మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా తాను ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతానని ఆయన అన్నారు. జలయజ్ఞం లోపాలపై తాను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేఖ రాయడంలో ఏ విధమైన రాజకీయ ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట పెంచడానికే తాను లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ప్రభుత్వం సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఏ ప్రాజెక్టులు పూర్తి చేయగలం, ఏవి పూర్తి చేయలేం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రాధాన్యత గల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X