నక్సలిజాన్ని అంతం చేయాలి: పిఎం

Manmohan Singh
న్యూఢిల్లీ: నక్సలిజం అంతానికి సత్వర, కచ్చితమైన చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. భారత ప్రభుత్వ అధికారాన్ని సవాల్ చేసే ఏ శక్తులను కూడా ఉపేక్షించకూడదని ఆయన అన్నారు. వామపక్ష తీవ్రం దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా,కచ్చితమైన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఇటీవలి సంఘటనలు గుర్తు చేస్తున్నాయని ఆనయ అన్నారు. భారత ప్రభుత్వ అధికారాన్ని, మన ప్రజాతంత్ర రాజకీయాలను సవాల్ చేసే వారికి ఏ విధమైన అవకాశం ఇవ్వకూడదని ఆయన అన్నారు. సివిల్ సర్వీసెసె దినోత్సవ కార్యక్రమంలో ఆయన బుధవారం మాట్లాడారు.

అభివృద్ధి జరగకపోవడం వల్లనే నక్సలిజం తలెత్తుతోందనే విషయాన్ని మరిచిపోకూడదని, గిరిజనులకు, వెనకబడిన ప్రాంతాల వారికి అభివృద్ధి ఫలాలు సరిగా అందకపోవడం వల్ల నక్సలిజం పెరుగుతోందని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానత్వాలను రూపుమాపకపోతే వేగవంతమైన పెరుగుదలకు అర్థం లేదని ఆయన అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ప్రధాని నక్సలిజంపై తీవ్రంగా మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+