హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య పర్యటనలకు ప్రత్యేక విమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనల కోసం రూ.150 కోట్లతో చిన్న విమానాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందింది. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాక హెలికాప్టర్‌ ప్రయాణానికి రోశయ్య ఆసక్తి చూపడంలేదు. గంటలోపు ప్రయాణాల కోసమే దానిని వినియోగించేందుకు నిర్ణయించి, దూర ప్రయాణాలకు విమానయానంతోపాటు రైలు ప్రయాణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజాపథం ప్రారంభానికి ఆయన చీరాలకు రైళ్లో వెళ్లారు. అనంతపురం, నెల్లూరు పర్యటనలకూ రైలు మార్గాలనే ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని, రైళ్లపై దాడి జరిగే ప్రమాదం ఉందని తాజాగా నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందినట్లు ఆయన భద్రత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విమానం కొనుగోలు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

నిజానికి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే 15 సీట్ల సామర్థ్యమున్న అధునాతన విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే నిధుల విడుదలకు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య నిరాకరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది ప్రాంతాల్లోనే విమానాలు దిగడానికి రన్‌ వేలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా ప్రాంతీయ విమానాశ్రయాల పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త విమానం కొనుగోలు ప్రతిపాదనలేమీ తమ దృష్టికి రాలేదని పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X