వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్ నివేదిక అవసరం లేదు: కెకె

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్ : రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీకి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కె. కేశవరావు అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్ కమిటీకి నివేదిక ఇవ్వాలనే కొందరు నాయకుల వాదనను ఆయన ఖండించారు. పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు నివేదికలు ఇచ్చారని, అవి పార్టీ నివేదికలేనని, అందువల్ల ప్రత్యేకంగా డిఎస్ నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఐపియల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని ఆయన చెప్పారు. ఐపియల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐపియల్ వ్యవహారం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారలేదని ఆయన అన్నారు. ఐపియల్ వ్యవహారంలో తప్పులను ప్రభుత్వం సహించబోదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X