వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ ఫస్టియర్ లో బాలికలదే హవా

By Pratap
|
Google Oneindia TeluguNews

Intermediate Students
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలుర కన్నా బాలికల శాతం ఎక్కవగా ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం విడుదల చేసింది. బాలికలు 53 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలులు 45 శాతం మాత్రమే పాసయ్యారు. మొత్తం 48.56 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇది నిరుటి కన్నా రెండు శాతం అధికం. మొత్తం 8 లక్షల 19 వేల 120 మంది పరీక్ష రాయగా 3 లక్షల 97 వేల 805 మంది ఉత్తీర్ణులయ్యారు. మార్కుల జాబితాలను విద్యార్థులు ఈ నెల 28వ తేదీ నుంచి సంబంధిత కళాశాలల్లో పొందవచ్చు.

జిల్లాలవారీగా చూస్తే కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నల్లగొండ జిల్లాలో అత్యల్పంగా 34 శాతం మంది మాత్రమే పాసయ్యారు. వచ్చే నెల 4,5 తేదీల్లో రీవాల్యుయేషన్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బలరామయ్య చెప్పారు. జూన్ 2వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X