లావణ్యకు న్యాయం చేయాలని డిమాండ్
లావణ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీపీకి వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మహిళా చేతన కార్యదర్శి పద్మ మాట్లాడారు. లావణ్య భర్తను ఇండియాకు రప్పిం చేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పూర్తి విచారణ చేపట్టి శివరామకృష్ణ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. లావణ్యకు తక్షణ న్యాయం జరగకపోతే గాజువాక పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు.
స్పందించిన సీపీ: మహిళా చేతన డిమాం డ్లపై సీపీ స్పందించారు. లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. రెండు రోజుల క్రితమే గాజువాక పోలీసులు విజయవాడ, గుంటూరు ప్రాం తాలకు వెళ్లారని విలేకరులకు ఆయన తెలిపారు. లావణ్య భర్త, అతని కుటుంబ సభ్యులపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గబోమని చెప్పారు.
ఎన్నారై సెల్ ను ఆశ్రయించనున్న లావణ్య: లావణ్య హైదరాబాద్లోని ఎన్నారై సెల్ను మంగళవారం ఆశ్రయించ నుంది. భర్తపై ఫిర్యాదు చేసేందు కు ఆమె హైదరాబాద్ బయల్దేరింది. బాధితుల ఇబ్బం దులను పరిష్కరించేందుకు ఇటీవల ఎన్నారై సెల్ ఏర్పాటైంది. ఇక్కడ ఫిర్యాదు చేస్తే విదేశాల్లో ఉన్న నిం దితులను ఇండియా రప్పించేందుకు వీలువుతుంది.