హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లావణ్యకు న్యాయం చేయాలని డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
హైదరాబాద్: ఎన్నారై భర్త శివరామకృష్ణ చేతిలో దారుణ హింసకు గురైన లావణ్యకు న్యాయం చేయాలని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ డిమాండ్‌ చేశారు. గాజువాకకు చెందిన లావణ్య అనే మహిళ తనను భర్త శివరామకృష్ణ, అత్తమామలు కమలమ్మ, గంగరాజు, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని నాలుగురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న శివరామకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులతో కలసి మహిళా చేతన సభ్యులు సోమవారం పోలీస్‌ కమిషనర్‌ పూర్ణచంద్రరావును కలి శారు.

లావణ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీపీకి వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మహిళా చేతన కార్యదర్శి పద్మ మాట్లాడారు. లావణ్య భర్తను ఇండియాకు రప్పిం చేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పూర్తి విచారణ చేపట్టి శివరామకృష్ణ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. లావణ్యకు తక్షణ న్యాయం జరగకపోతే గాజువాక పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు.

స్పందించిన సీపీ: మహిళా చేతన డిమాం డ్లపై సీపీ స్పందించారు. లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. రెండు రోజుల క్రితమే గాజువాక పోలీసులు విజయవాడ, గుంటూరు ప్రాం తాలకు వెళ్లారని విలేకరులకు ఆయన తెలిపారు. లావణ్య భర్త, అతని కుటుంబ సభ్యులపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గబోమని చెప్పారు.

ఎన్నారై సెల్‌ ను ఆశ్రయించనున్న లావణ్య: లావణ్య హైదరాబాద్‌లోని ఎన్నారై సెల్‌ను మంగళవారం ఆశ్రయించ నుంది. భర్తపై ఫిర్యాదు చేసేందు కు ఆమె హైదరాబాద్‌ బయల్దేరింది. బాధితుల ఇబ్బం దులను పరిష్కరించేందుకు ఇటీవల ఎన్నారై సెల్‌ ఏర్పాటైంది. ఇక్కడ ఫిర్యాదు చేస్తే విదేశాల్లో ఉన్న నిం దితులను ఇండియా రప్పించేందుకు వీలువుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X