శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మా వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పి సిగ్నలింగ్ రూంను ఢీకొట్టింది. దీంతో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బ తిన్నది. గూడ్స్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
సికింద్రాబాద్ - హౌరా ఎక్స్ ప్రెస్ రైలు, తిరుపతి - పూరి ఎక్స్ ప్రెస్ రైళ్లను మధ్యలో ఆపేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణం తెలియడం లేదు. అధికారులు మరమ్మత్తు కార్యక్రమాలకు ఆదేశించారు.