వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో పర్యటిస్తా: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్ : ప్రజల్లో తిరగడానికి తనకు ఎలాంటి భయం లేదని, తెలంగాణ ప్రాంతంలో పర్యటించి తీరుతానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సమైక్యవాదాన్ని బలపరిచిన చిరంజీవిని తెలంగాణలో తిరుగనివ్వబోమని తెలంగాణవాదులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు. సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

ట్రిపుల్ ఐటిలో సీట్లను ఎందుకు తగ్గించారని తాము ముఖ్యమంత్రిని అడిగినట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించినట్లు ఆయన చెప్పారు. ఇంటర్మీడియెట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పోలవరం యాత్ర షెడ్యూల్ ను ప్రభుత్వానికి అందించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X