వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వ్యతిరేకం కాదు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: సమైక్యమంటే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. భావోద్వేగాలు తగ్గిన తర్వాత ఒకే విధానాన్ని చెప్పిన తమ పార్టీని ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు గౌరవిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల అభిమానం నుంచి తనను ఏ శక్తీ విడదీయలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అందులో ఆ శక్తులు విఫలమవుతాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X