ఎంసెట్ విద్యార్ధులకు హైటెక్ సదపాయాలు
ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎంసెట్ పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 3,28,615 మంది, మెడిసిన్ విభాగంలో 54,472 మంది హాజరు కానున్నారు. వీరిలో ఇప్పటికే లక్షా 50 వేల మంది విద్యార్థులకు ఎస్ ఎంఎస్ లు పంపించడం ఆరంభించారు. ఎంసెట్ పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ కుండా కట్టడి చేశారు. పట్టణాల్లో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాలు వివరాలు, చిరునామాలు దొరకక అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసే ఎంసెట్ను కోల్పోయారు.
ఈ విషయమై కొందరు విద్యా ర్థుల తల్లితండ్రులు గడిచిన ఏడాది మానవ హక్కుల కమిషన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దుస్థితి తలెత్తకుండా విద్యార్థులకు 15 రోజుల ముందుగానే హాల్ టిక్కెట్ల పంపిణీ, ఎంసెట్ పరీక్ష కేంద్రం చిరునామా వంటి వివరాలను ఎస్ ఎంఎస్ ద్వారా విద్యార్థులకు అందించాలని సెల్ నంబర్లు లేని విద్యార్థులకు సమాచారాన్ని అందించేందుకు వెబ్ సైట్ లో ఏర్పాటు చేయాలని జేఎన్ టీయూ విశ్వవిద్యాల యాన్ని ఆదేశించింది. ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మానవ హక్కుల సూచనలు పాటిస్తూ జేఎన్ టీ యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.