కసబ్ పై ఏ క్షణంలోనైనా తీర్పు

ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎల్ తహిల్యాన్ని తీర్పు వెలువరించే సమయంలో కసబ్ ను జైలు నుంచి కోర్టుకు తీసుకుని వచ్చారు. కసబ్ పై మోపిన అభియోగాలను తహిల్యాని వినిపించారు. ఆ తర్వాత ఐదు పేజీల తీర్పు ప్రతిని చదవడం ప్రారంభించారు. తీర్పు వెలువరించిన సమయంలో మీడియాను ప్రత్యేక అనుమతి పత్రాలతో లోనికి అనుమతించారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కసబ్ తో పాటు ఈ కేసులో ఫహీం అన్సారీ, షాబుద్దీన్ లను కూడా పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ ముగ్గురు నిందితలకు తహిల్యాన్ని తీర్పు పాఠం చదివి వినిపించారు. భారత్ కు చెందిన అన్సారీ, షాబుద్దీన్ లు ఉగ్రవాదులకు దాడులు చేసేందుకు వీలుగా మ్యాప్ లను, తదితర సమాచారాన్ని చేరవేసినట్లు అభియోగాలు ఎదుర్కున్నారు.
ముంబై మారణహోమం కేసు విచారణకు 11 నెలల కాలం పట్టింది. కసబ్ నేరాన్ని అంగీకరించడంతో విచారణ ముగిసింది. ఈ కేసులో కసబ్ కిరాతకంగా కాల్పులు జరిపాడని 30 మంది సాక్ష్యులు కోర్టుకు తెలిపారు. ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 166 మంది మరణించారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఇతనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. పలువురు సాక్ష్యులను విచారించింది. ముంబై దాడులకు సూత్రధారులు పాకిస్తాన్ లోని ఉగ్రవాద నాయకులు కాగా పాత్రధారి కసబ్. కసబ్ కు వేసే శిక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కసబ్ ను బహిరంగంగా ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications