హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రజలకు చిరు పువ్వులు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణ ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారని, చిరంజీవి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ విమర్శించారు. సింగరేణి కార్మికుల జెఎసి సమావేశానికి మంగళవారం ఆయన మిగతా జెఎసి నాయకులతో పాటు హాజరయ్యారు. పోలవరం బస్సు యాత్ర ముసుగులో చిరంజీవి సమైక్యాంధ్ర యాత్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.

పోలవరం విషయంలో చిరంజీవి చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని నిపుణులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సింగరేణి కార్మికుల సమన్వయానికే సింగరేణి జెఎసి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తామని, ఇందుకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X