హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రవాద చొరబాట్లు లేవు: ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: హైదరాబాదులోకి ఆల్ ఖైదా ఉగ్రవాదులు చొరబడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అన్నారు. కేంద్ర హోం శాఖ మంగళవారం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ తీరం వెంబదడి 30 నుంచి 50 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, వీరిలో 15 మంది దాకా హైదరాబాద్ చేరుకున్నారని వార్తలు వచ్చాయి. మే 18వ తేదీ టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు వ్యుహం రచించిట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఖాన్ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహించి, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమకు పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది హక్ నుంచి పలు విధ్వంసాలకు సంబంధించిన సమాచారం లభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హైదరాబాదులో వివిధ నేరాలకు పాల్పడిన వికారుద్దిన్ కు సంబంధించి కొంత సమాచారం తమ ఉందని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X